హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ’చిత్రలహరి‘. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. తన జీవితం ఎంత నరకంగా ఉందో ధరమ్ తేజ్ వివరిస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. ‘ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను…’ అని ధరమ్ తేజ్ బాధపడుతూ చెబుతున్న డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.