ఏపీలో పార్టీల ప్రచారం చాలా తీవ్రంగా సాగుతుంది. జనసేన అధినేత పవన్కల్యాణ్ వడదెబ్బ నుంచి కోలుకున్నారు. నిన్న అంటే శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవన్.. డీహైడ్రేషన్తో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈరోజు సాయంత్రానికి ఆయన కోలుకోవడంతో గుంటూరు జిల్లా తెనాలిలో ఈ రాత్రి నిర్వహించనున్న ప్రచార సభకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా తాజాగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా సినీనటుడు రామ్చరణ్ కూడా రెండురోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. అయితే కాసేపట్లో విజయవాడ చేరుకోనున్న రామ్ చరణ్.. బాబాయ్తో కలిసి తెనాలి ప్రచార సభలో పాల్గొనే అవకాశముంది. కాగా మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ కూడా ఇప్పటికే జనసేనకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.