అమెరికాలో తెలంగాణకు చెందిన ఒక యువతి ఆత్యహత్యకు పాల్పడింది. భర్తతో విభేదాలతో విసిగిపోయి ప్రాణం తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి చెందిన సెగ్యం సంధ్య.. అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రం మెంఫిస్ సిటీలో భర్తతో కలసి నివసిస్తోంది.
భర్తతో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. నేపథ్యంలో ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విమలమ్మ, మహేందర్లు కడుపుకోతతో తల్లడిల్లుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.