న్యూఢిల్లీ, ఆగస్ట్ 15: జాతీయగీతాలు పాడి అలరించిన చిన్నారులను చూసే సరికి మోదీ ఆంద్యంతం మైమరచిపోయి ప్రొటోకాల్ సైతం పక్కన పెట్టి పిల్లలను పలకరించగా, సెక్యూరిటీ సిబ్బంది ఉరుకులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఉదయం ఎర్రకోట దగ్గర జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం ముగిసిన తరువాత, వేదిక దిగి వచ్చిన మోదీ, జాతీయ గీతాలను పాడి అలరించిన చిన్నారుల మధ్యకు వెళ్ళి వారితో ముచ్చటించి, అప్యాయతను చూపించారు. కాగా, కొందరు చిన్నారులు కృష్ణుని వేషంలోనే ఎర్రకోట వద్దకు రాగా, వారిని మోదీ పలకరించారు. మోదీ పిల్లల్తో మమేకం అయిన సమయంలో, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టిన పిల్లలను అదుపు చేసేందుకు కష్టాలు పడాల్సివచ్చింది. అనంతరం అందరికీ అభివందనం చేస్తూ, మోదీ తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో కూడా ప్రధాని మోదీ పలుమార్లు ప్రొటోకాల్ నిబంధనలు పక్కన పెట్టారు.