సమయం కావాలి!

SMTV Desk 2019-04-04 18:23:13  Hardik pandya, KL Rahul, BCCI, Karan johar, Coffee with karan show, notices, ipl 2019

న్యూఢిల్లీ : టీం ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ కాఫీ విత్ కరన్ టీవీ కార్యక్రమంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం వల్ల వీరిద్దరిపై వేటు కూడా పడింది. అయితే తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై స్పందించిన హార్థిక్‌, రాహుల్‌లు తమ బిజీ షెడ్యూల్‌ కారణంగా వ్యక్తిగతంగా హాజరుకాలేమని సమయం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు హార్థిక్‌ పాండాయ, రాహుల్‌లు ఐపిఎల్‌లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ అయ్యే అవకాశం ఉండటంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో బిసిసిఐ చర్చిస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ విషయంపై జస్టిస్‌ జైన్‌ మాట్లాడుతూ…హార్థిక్‌, రాహుల్‌లకు వారం క్రితమే నోటీసులు జారీ చేశాం. విచారణకు వారు కూడా ఉండాలని ఆదేశించాం. సహజ న్యాయం ప్రకారం. వారి వాదనను వినాల్సి ఉంది. విచారణకు హాజై వారి వాదనను వినిపించాల్సిన బాధ్యత వారిదే. ఎప్పుడు వస్తారో చూడాలని తెలిపారు.