హైదరాబాద్: గత నాలుగు సంవత్సరాల నుంచి బిజెపితో స్నేహం చేసిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడారు. మోడీ తీవ్రవాది అని, చెడ్డ గుణాలున్న వ్యక్తి అని విమర్శించారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లు తెచ్చి మైనారిటీ సోదరులను జైల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్లో గోద్రా అలర్లలో రెండు వేల మంది మైనార్టీల సోదరులను పొట్టనపెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు గుజరాత్ సిఎం పదవికి మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తిని తానేనని గుర్తు చేశారు. మోడీ మళ్లీ వస్తే మైనార్టీలకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండ మోడీ మోసం చేశాడని ఎన్డిఎలో నుంచి బాబు బయటకు వచ్చిన విషయం విదితమే.