నన్ను ఎవరు ఓడించలేరు

SMTV Desk 2019-04-04 16:45:21  Nara lokesh,

ఏపీలో రాజకీయ పార్టీల తీవ్ర ప్రచారం జరుగుతోంది. అలాగే.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి బరిలో ఉన్న తనను ఎవరూ ఓడించలేరని అన్నారు మంత్రి నారా లోకేశ్. తనను ఓడించేందుకు వైసీపీ కిరాయి తారలను ప్రచారంలోకి దింపుతోందని మండిపడ్డారు.

అయితే మంగళగిరికి చెందిన తాడిబోయిన ఉమా యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ సంఖ్యలో కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఆయన అనుచరులు.. నేతలు.. టీడీపీలో చేరడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2024 నాటికి పేదరికం లేకుండా చేయడమే తాము టార్గెట్ గా ఎంచుకొని పని చేస్తున్నట్లు లోకేశ్ వివరించారు.