రాజస్థాన్‌ గవర్నర్‌పై ఈసీ వేటు

SMTV Desk 2019-04-04 16:27:33  Kalyan Singh, Rajasthan Governor Kalyan Singh, election commission of india, bjp

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ గవర్నర్‌ కళ్యాన్‌ సింగ్‌పై ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. గత నెల 23న బిజెపి కార్యకర్తలతో సమావేశమైన కళ్యాన్‌ సింగ్‌ బిజెపి మళ్లీ అధికారంలోకి రావాలి మోదీ,కావాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధలను ఉల్లంఘించడమేనని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) భావిస్తోంది. కళ్యాణ్‌ సింగ్‌ రాజ్యంగబద్ధమైన పదవి లో కానసాగుతుండటంతో ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఈసి వెల్లడించాయి. ఈ విషయం పై ఈసీ విచారణకు ఆదేశించింది.