అది మేనిఫెస్టో కాదు....అబద్దాల హామీ...!

SMTV Desk 2019-04-03 18:21:24  bjp, congress, narendramodi, rahul gandhi

ఈటానగర్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో తూర్పు సియాంగ్‌ జిల్లా పాసిఘాట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ....కాంగ్రెస్‌ అబద్దపు హామీల చిట్టాను ప్రజల ముందుంచిందని, గతంలో కూడా ఇలాగే హామీలిచ్చి కాంగ్రెస్‌ భంగపడిందిఅని అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి హామీలే ఇస్తుంది. ప్రజలను తెలివితక్కువ వారిని చేసేందుకు అబద్దాలతో మానిఫెస్టో తయారుచేసింది. అది మేనిఫెస్టో కాదు. అబద్దాల హామీలు అని కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ పనిచేస్తుంది. కానీ మేం ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం బిజెపి కట్టుబడి ఉందని మోది అన్నారు. రైతులను మోసం చేసి ఓట్లు అడిగే పార్టీ తమది కాదని మోది ఈ సందర్భంగా అన్నారు. వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తామన్నారు. ఈ ఎన్నికలు నమ్మకానికి, అవినీతికి, నిబద్ధతకు, కుట్రకు మధ్య జరుగుతున్న పోరు అని మోది తెలిపారు.