ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ కాన్వాయ్లో పోలీసులు పోలీసులు సమాచారంతో బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఊహించని విధంగా కోటీ 80 లక్షల రూపాయిలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఈ నగదును స్వాధీనం చేసుకుని ఐటి అధికారులకు అప్పగించారు. ఈ నగదుకు సరైన పత్రాలు చూపలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.