ప్రిన్స్ అభిమానుల మద్దతు ఎవరికంటే....

SMTV Desk 2017-08-14 18:40:44  nandhyala, elections, prince mahesh babu, shilpa mohan reddy

నంద్యాల, ఆగస్ట్ 14 : నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఇరు పక్షాల ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు మద్దతు పలికారు. అయితే నంద్యాలకు చేరుకున్న వైకాపా నేత కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో శిల్పాకు మద్దతివ్వాలని కోరిన ఆయన నేటి నుంచి శిల్పా తరుపున ప్రచారంలో తాము పాల్గొంటామని అభిమాన సంఘం ప్రతినిధులు ఆది శేషగిరిరావుకు హామీ ఇచ్చారు.