స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ శాఖల్లోని ప్రొబెషనరీ ఆఫీర్స్(పీవో) పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ ఉత్తీర్ణులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22 వరకూ ముగియనుంది. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జూన్లో ప్రిలిమినరీ నిర్వహించి, జులైలో మెయిన్ ఎగ్జామ్, సెప్టెంబర్లో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. అక్టోబర్ నాటికి ఫైనల్ రిజల్ట్ని రిలీజ్ చేయనున్నారు.
ఖాళీలు : 2వేలు
పోస్టు పేరు : ప్రొబెషనరీ ఆఫీసర్స్
అర్హత : ఏదైనా డిగ్రీ
వయసు : 01-04-2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సడలింపులు వర్తిస్తాయి)
దరఖాస్తు ఫీజు : రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారాఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 02-04-2019
చివరి తేదీ : 22-04-2019
హాల్ టికెట్ డౌన్ లోడ్ : 07-05-2019
ప్రిలిమినరీ పరీక్ష : జూన్ 8, 9,15,16 తేదీల్లో
మెయిన్ ఎగ్జామ్ : జులై రెండో వారం నుంచి
మెయిన్ ఎగ్జామ్ : 20-07-2019
ఇంటర్వ్యూ : సెప్టెంబర్లో
ఫైనల్ రిజల్ట్ : అక్టోబర్లో