ముంబయి : బాలీవుడ్ నటుడు అజయ్దేవగన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, టబు హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దేదే ప్యార్ దే’. ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం అజయ్ దేవగన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఆశిష్(అజయ్ దేవగన్) ,అయేషా( రకుల్ ప్రీత్ సింగ్) జీవితంలో జరిగిన సంఘటలను ఫన్నీగా చూపించారు. అజయ్ (50), అయేషా ( 26) లండన్ లో ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాగే జర్నీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 2017లో విడుదలైన గోల్మాల్ ఎగైన్ సినిమా నేపథ్యంలోనే ’దేదే ప్యార్ దే ‘ సినిమా ఉంటుందని నిర్మాతలు వెల్లడించారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్, అలోక్ నాథ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 17న విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు అకివ్ అలీ దర్శకత్వం వహించారు.