మొహాలీ : ఐపిఎల్లో భాగంగా సోమవారం మొహాలీలో ఢిల్లీ క్యాపిటల్స కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు మధ్య జరిగన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తొలి మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్పై మెరుపు అర్ధశతకంతో అందరి దృష్టినీ ఆకర్షించిన రిషబ్ పంత్.. తర్వాత కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో బంతి విసరక ముందే.. ఫోర్ వెళ్తుందని వికెట్ల వెనుక నుంచి చెప్పి ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా.. మొహాలి వేదికగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ముగిసిన మ్యాచ్లో గెలుపు ముంగిట.. సిక్స్ కొట్టేందుకు వెళ్లి.. ఔటై మ్యాచ్ను చేజార్చాడంటూ విమర్శలపాలయ్యాడు. మొత్తంగా.. ఐపీఎల్లో రిషబ్ పంత్.. తన ప్రతిభ, ప్రవర్తనతో అందరి నోళ్లలోనూ నానుతున్నాడు. ఇందులో భాగంగానే పంజాబ్తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సర్ఫరాజ్ ఖాన్ని రాత్రి మ్యాచ్లో రిషబ్ పంత్ సరదాగా టీజ్ చేశాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్లో ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తలమీదుగా అతను కొట్టిన ఫోర్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. కానీ.. పేసర్ క్రిస్మోరీస్ బౌలింగ్లో ఓ బంతిని హుక్ చేయబోయి సర్ఫరాజ్ దెబ్బ తగిలించుకున్నాడు. క్రిస్మోరీస్ 130కిమీ వేగంతో విసిరిన బంతిని హుక్ చేయబోయిన సర్ఫరాజ్ బంతి అనూహ్యంగా ఎత్తు తగ్గడంతో కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో.. వేగంగా వచ్చిన బంతి అతని పొట్ట భాగంలో బలంగా తాకింది. దీంతో.. కాసేపు క్రీజులోనే సర్ఫరాజ్ విలవిలలాడిపోయాడు. సర్ఫరాజ్ పరిస్థితిని గమనించిన రిషబ్ పంత్.. కవ్వింపుగా అతనికి దగ్గరికి వెళ్లి.. సరదాగా టీజ్ చేయడం మొదలెట్టాడు.