మణిపూర్ విద్యా శాఖ మాజీ మంత్రి కుమారుడు అనుమానాస్పద మృతి!!

SMTV Desk 2017-08-14 15:34:10  Delhi, Ex-Education minister, fallen from restaurant, Death

ఢిల్లీ, ఆగస్ట్ 14: ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రెండో ఫ్లోర్ నుంచి కిందపడి యువకుడు మరణించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, మరణించిన యువకుడు మణిపూర్ విద్యా శాఖ మాజీ మంత్రి ఎం ఒకేంద్రు కుమారుడు, సిద్ధార్థగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే సిద్ధార్థ సఫ్దర్ గంజ్ ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు. సిద్ధార్థ కారు డ్రైవర్ రెస్టారెంట్ వద్ద దించి వెళ్లినట్టు పోలీసు గుర్తించారు. మద్యం తాగిన ఆయన టెర్రస్ పైకి ఎక్కి, అక్కడి నుంచి గోడ మీదుగా పక్కనే ఉన్న మరో రెస్టారెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, వెయిటర్ వారించిగా, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సిద్ధార్థ రెండు రెస్టారెంట్స్ మధ్య ఉన్న రెయిలింగ్‌ను దాటతూ కిందపడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలియజేయగా, అతని సోదరి విచారణ తప్పుదారి పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.