8వ తరగతి పూర్తి చేసి తొమ్మిదో తరగతిలోకి వెళ్లే విద్యార్థులకు అద్భుత అవకాశం. ఈ వేసవి సెలవుల్లో ఇస్రో చేపట్టే ‘యువ విజ్ఞాన కార్యక్రమ్’లో చేరొచ్చు. అంతరిక్ష సాంకేతిక, వైజ్ఞానిక అంశాలపై, ప్రయోగాలపై ఈ సమ్మర్ హాలిడేస్లో అవగాహన కల్పించనున్నారు. ఈ కోర్సుకి ఎంపికైనవారికి మే నెలలో ఉచిత ఓరియెంటేషన్ తరగతులు, నిపుణులతో చర్చా కార్యక్రమాలు ఉంటాయి.
మే నెలలో దేశంలోని 4 ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల పాటు కోర్సు నేర్పిస్తారు. హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు ప్రాధన్యం ఉంటుంది.
అర్హత..
8వ తరగతి పరీక్షల్లో 50శాతం రిజల్ట్ ఉండాలి
ఆసక్తి గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్కి లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.