అమేథీ పార్లమెంటు సీటులో ఓటమిని తప్పించుకునేందుకే, రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీకి దిగుతున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. అమేథి నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ఏమి చేయలేదని, అందుకే రాహుల్ కేరళకు పారిపోతున్నారని అమిత్ షా విమర్శించారు. నగీనాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై అమిత్ షా స్పందించారు. అంతేకాదు రాహుల్ గాంధీ మతాల పేరిట విబేధాలు కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు.