సెహ్వాగ్ పై నెటిజన్ల ఆగ్రహం

SMTV Desk 2017-08-13 18:34:11  Uttarapradesh, BRD hospital, Virender Sehwag, Child deaths

గోరఖ్‌పూర్, ఆగస్ట్ 13: ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సుమారు 65 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. మెదడు వాపు వ్యాధి తొలిసారి 1978లో వెలుగులోకి వచ్చిందని ఇప్పటి వరకు మొత్తం 50 వేల మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నేను కూడా 1978లో జన్మించానని గుర్తు చేశారు. కాగా, సెహ్వాగ్ ట్వీట్ పిల్లల మృతికి కారణం వారికి వచ్చిన వ్యాధి మాత్రమే అనేలా ఉందని మండిపడుతున్నారు. బీఆర్డీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోయారన్న కారణాన్ని సెహ్వాగ్ ఎందుకు స్పష్టం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.