టి-కాంగ్రెస్‌లో మరో వికెట్..

SMTV Desk 2019-03-30 18:24:02  T congress,

తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో నేత పార్టీకి గుడ్ బై చెప్పి తెరాసలోకి వెళ్లిపోతూనే ఉన్నారు. దీనిపై గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యి చర్చిస్తున్న సమయంలోనే మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెరాసలో చేరిపోయారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలోని తన అనుచరులు మరికొందరు నేతలు తెరాసలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని నర్సారెడ్డి చెప్పారు.