వాషింగ్టన్ : అమెరికాలో డాక్టర్గా పని చేస్తున్న నందిగం మణిదీప్ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. కర్నాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన మణిదీప్ న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. మణిదీప్ మృతిపై అమెరికా అధికారులు అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మణిదీప్ మృతికి కారణాలు తెలియరాలేదు. తమ కొడుకు మణిదీప్ మృతిపై విచారణ చేపట్టాలని మణిదీప్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక కస్తూర్బా మెడికల్ కాలేజీలో మణిదీప్ ఎంబిబిఎస్ పూర్తి చేశారు. మూడేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అతను న్యూజెర్సీ వెళ్లాడు. అక్కడ సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. మణిదీప్ మృతదేహాన్ని భారత్కు పంపించేందుకు ఎంబసితో తానా టచ్లో ఉంది. ఆదివారం సాయంత్రం వరకు మణిదీప్ మృతదేహం అతని స్వస్థలానికి తరలించే అవకాశం ఉంది.