సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. 2 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందుంచింది. రాజస్థాన్ ఆటగాడు సంజు శాంసన్ 55 బంతుల్లో 102 పరుగులు చేయడంతో రాజస్థాన్ అంత స్కోరు చేయగలిగింది. కెప్టెన్ ఆజింక్య రహానె 49 బంతుల్లో 70 పురుగులు చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగింది. ఫోర్ల మీద ఫోర్లు, సిక్సుల మీద సిక్సులు కొడుతూ.. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారరు. స్టేడియం మొత్తం ప్రేక్షకుల కేరింతలతో మోగిపోయింది. ముఖ్యంగా డెవిడ్ వార్నర్ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్తో వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడి ధాటికి తొలి 6 ఓవర్లలో సన్రైజర్స్ 69 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వార్నర్ జోరును కొనసాగించడంతో సన్ రైజర్స్ స్కోరు 53 బంతుల్లోనే 100రన్స్ దాటింది. చెలరేగిపోయి ఆడుతున్న వార్నర్ను స్టోక్స్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ కూడా జోరుగా ఆడాడు. 3 సిక్సర్లు, ఒక బౌండరీతో క్రీజులో ఉన్నంతసేపు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ఐతే 3 పరుగుల తేడాలో విలియమ్సన్ (14), విజయ్ శంకర్, మనీష్ పాండే (1) ఔటయ్యారు. అయితే చివరిలో యూసుఫ్ పఠాన్ 12 బంతుల్లో 16 రన్స్, రషీద్ ఖాన్ 8 బంతుల్లో 15 రన్స్ చేయడంతో సన్రైజర్స్ గెలుపొందింది. ఆఖరిలో 8 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన ఉండగా.. ఆర్చర్ బౌలింగ్లో రషీద్.. ఫోర్, సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు.