బీటెక్ లేదా డిప్లొమా చేసినవారికి శుభవార్త. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్రాధాతు నిగమ్ లిమిటెడ్లో అప్రెంటీస్ చేయడానికి మంచి ఛాన్స్. హైదరాబాద్లోని కంచన్బాగ్లో ఉంది మిధాని. బీటెక్ చదివినవారికి 40, డిప్లొమా చదివినవారికి 20 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్షిప్ చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు మిధాని అధికారిక www.mhrdnats.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 13న వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఉంటుంది.
బీటెక్, డిప్లొమా అభ్యర్థుల మార్కుల ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్ ఉంటుంది.