చంద్రబాబు పర్యటనలో అపశృతి

SMTV Desk 2019-03-28 15:12:34  Ap cm, Chandra Babu,

అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సప్తగిరి సర్కిల్ సమీపంలోని మసీదు సమీపంలో నిల్చున్నారు.

మసీదు పైకి ఎక్కువ మంది యువకులు ఎక్కారు. పురాతన కట్టడం కావటంతో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు 33 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, మడకశిరలో చంద్రబాబు పర్యటనకు వెళుతున్న ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఒక టీడీపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందగా మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక టీడీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. గురువారం ఉదయం పుట్టపర్తిలో పర్యటించనున్న బాబు అనంతపురంలోనే బస చేసారు.