చుక్కలు చూపించిన మార్నింగ్ స్టార్స్ ట్రావెల్స్!

SMTV Desk 2017-08-12 12:40:08  morning stars travels, banglore, journey, passengers

బెంగుళూరు, ఆగస్ట్ 12 : "మార్నింగ్ స్టార్" కు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తనిఖీల భయంతో దాదాపు ఏడు గంటల పాటు తెల్లవార్లు బెంగుళూరు అంత చుట్టీ హౌస్ పేట సమీపానికి వచ్చి నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అయితే నేడు పెళ్లి చూపులు ఉండగా నిన్న రాత్రి బస్సెక్కితే ఇప్పటికి ఆ బస్ హైదరాబాద్ చేరుకోకపోవడంతో తన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ ఓ యువతి వాపోయింది. అనుమతి లేకుండా బస్సులను నడుపుతూ, రాత్రంతా ప్రయాణించినా కూడా కనీసం100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లలేదని మరో మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు బస్సు ఎక్కినా హైదరాబాద్ చేరే సరికి రాత్రి అవుతుందని, యాజమాన్యం మొత్తం మాకు చుక్కలు చూపించింద౦టూ పేర్కొన్నారు. ఇక్కడి పరిస్థితిని వివరించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదని ప్రయాణికులు మండిపడ్డారు.