ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం...ఇద్దరు మృతి, 30 మందికి పైగా గాయాలు

SMTV Desk 2019-03-26 17:12:53  new delhi, sahinbagh fire accident, delhi shaheen bagh fire accident

న్యూఢిల్లీ, మార్చ్ 26: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సుమారు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.