యూపీలో అత్యవసర సమావేశం..!

SMTV Desk 2017-08-12 11:55:20  38 CHILDRENS DIED, GORAKH POOR, YOGI ADHITHYANATH

యూపీ, ఆగస్ట్ 12 : 48 గంటల్లోనే 38 మంది పిల్లలు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో మరణించిన ఘటన గోరఖ్ పూర్ లోని బీఆర్డీ ఆస్పత్రి లో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మన దేశంలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఇలా ఉందంటూ చెప్పడానికి మరో నిదర్శనంలా నిలుస్తుంది. ఇటీవల యోగి ఆ ఆసుపత్రిని సందర్శించి, అక్కడి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్న రెండు రోజులకే ఈ సంఘటన జరగడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్, మెడికల్ విద్య మంత్రి అశుతోష్ టాండన్ లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ ఇద్దరినీ వెంటనే గోరఖ్ పూర్ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.