మతిస్థిమితం లేని బాలికపై నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మణుగూరు గాంధీనగర్లో నిన్న సాయంత్రం మతిస్థిమితం లేని ఓ బాలిక తన ఇంటి ముందు ఒంటరిగా నిలబడి ఉంది. అదే సమయంలో అక్కడే ఉన్న ముగ్గరు యువకులు బాలికను చుట్టుముట్టారు. మాయమాటలతో మంచిగా మాట్లాడి.. తమ బైక్పై నిర్మానుష్య ప్రదేశానికి బైక్ పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధతో కేకలు పెట్టినా వద్దలేదా రాక్షసులు.
కాగా.. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరకు పంట పొలాల్లో ఓ కాలువలో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న బాలికను గుర్తించారు. అక్కడే అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను గమనించారు. వెంటనే వారిని పట్టుకున్నారు గ్రామస్తులు. గ్రామస్తులను చూడగానే ముగ్గిరిలో ఓ యువకుడు పరారయ్యాడు. మిగతా ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.