టిటికె ప్రెస్టేజ్‌ వాటాదారులకు ఫ్రీ షేర్స్

SMTV Desk 2019-03-25 19:11:12  TTK Prestige, TTK Prestige free shares on mumbai partners

ముంబై, మార్చ్ 25: టిటికె ప్రెస్టేజ్‌ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ముంబై, వాటాదారులకు ఉచితంగా షేర్లను జారీచేసేందుకు బోనస్‌ ఇష్యూకి ప్రతిపాదించినట్లు ప్రకటించింది. దీనిపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 29న సమావేశం కానున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 4.5శాతం పెరిగి రూ.8143వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.8189వరకూ పుంజుకుంది.