మార్చ్ 25: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ప్రభావంతో దేశంలో పెట్రోల్ ధర స్థిరంగా కొనసాగితే.. డీజిల్ ధర మాత్రం దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డీజిల్ ధర మాత్రం 11 పైసలు క్షీణించింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.86 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.66.49 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 78 మార్క్ పైనే కొనసాగుతోంది. రూ.78.48 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.69.64 వద్ద ఉంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 77 మార్క్ పైనే ఉంది. రూ.77.32 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.30 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.03 వద్ద, డీజిల్ ధర రూ.71.66 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.67 వద్ద, డీజిల్ ధర రూ.71.32 వద్ద కొనసాగుతోంది.