వాషింగ్టన్, ఆగస్ట్ 11 : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే మోదీ పర్యటన అమెరికాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హెయిథర్ నౌర్ట్ పేర్కొన్నారు. కాగా భారత ప్రధాని మోదీతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయంటూ ఆయన వివరించారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ నవంబర్ 28 నుండి మూడురోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ ను ఆహ్వానించిన విషయం విదితమే. కాగా ఆమె అమెరికా బృందానికి నేతృత్వం వహించనున్న విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.