పెరిగిన పెట్రోల్ ధర

SMTV Desk 2019-03-25 12:26:10  Petrol, Deseal, Price, New delhi

మార్చ్ 24: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ప్రభావంతో దేశంలో పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగ్గా.. డీజిల్ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 5 పైసలు పెరిగిన లీటర్ పెట్రోలు ధర రూ.72.86 కి చేరింది. మరోవైపు డీజిల్ ధర రూ.66.60 వద్ద కొనసాగుతోంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ పెట్రోలు ధర 5 పైసలు పెరిగి రూ.78.48 కి చేరగా.. డీజిల్ ధర కూడా రూ.69.76 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌పై‌ 66.75 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 59.04 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 6 పైసలు పెరిగి రూ.77.32 వద్ద.. డీజిల్ రూ.72.41 వద్ద కొనసాగుతున్నాయి. ఇక అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.03 ఉండగా.. డీజిల్‌ ధర రూ.71.78 వద్ద కొనసాగుతోంది.