రైనా న్యూ రికార్డ్

SMTV Desk 2019-03-25 12:25:13  ipl 2019, csk vs rcb, suresh raina, first batsmen ipl i n 5000 runs

మార్చ్ 24: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మరో రికార్డు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ 2019 సీజన్లో ప్రారంభ మ్యాచ్ సీఎస్కే vs ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేయడం ద్వారా.. ఐపీఎల్‌లో 5వేల పరుగుల మార్క్‌ని అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్న సురేశ్ రైనా.. ఈ మ్యాచ్‌కి ముందు 176 మ్యాచ్‌ల్లో 4,985 పరుగులతో ఉన్నాడు. ఈరోజు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా.. రైనా ఈ మార్క్‌ని అందుకున్నాడు. సురేశ్ రైనా తర్వాత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం 4,948 పరుగులతో కొనసాగుతున్నాడు.