రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారాల తనిఖీలో బంగారం పట్టుబడింది. తనిఖీలలో భాగంగా కస్టమ్స్ అధికారాలు తనిఖీ చేస్తుండగా మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికుడిని వద్ద 344 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.