వైసీపీ త‌ప్ప‌కుండా అధికారంలోకి వస్తుంది

SMTV Desk 2019-03-23 12:10:56  roja ,ysrcp

న‌గ‌రి నియోజ‌క‌వర్గ ప్ర‌జలు త‌న‌ను ఒక అక్క‌గా, చెల్లెగా, త‌ల్లిగా భావించి మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ఆర్‌.కే.రోజా అన్నారు. కాగా, ఆమె మీడియాతో మాట్లాడుతూ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి వారి మ‌ధ్య‌నే చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా 13 జిల్లాల్లో వైసీపీ అభ్య‌ర్ధుల ప్ర‌చారం చూస్తుంటే వైసీపీ త‌ప్ప‌కుండా అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, ఆ క్ర‌మంలోనే వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌జ‌లంద‌రూ ఒకే నిర్ణ‌యంపై ఉన్నార‌న్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను గెలిపించుకుంటేనే రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లంద‌రూ భావిస్తున్నార‌ని ఆర్‌.కే.రోజా చెప్పారు.