నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత

SMTV Desk 2019-03-23 11:41:24  nominations, lok sabha elections, assembly elections, tdp, ysrcp

ఏలూరు, మార్చ్ 22: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో వివధ పార్టీలకు చెందిన నాయకులు ఒకేసారి నామినేషన్‌ దాఖలు చేయడానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అభ్యర్ధి మంతెన శివరామరాజు ,వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి పీవిఎల్‌ నర్సింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్‌ వేయడానికి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది వారిద్దరికీ సర్దిచెప్పడాన్నికి పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్ధి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. టిడిపి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈ సారి పాగా వేయడానికి వైఎస్‌ఆర్‌సిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 2014ఎన్నికలో టిడిపి నుంచి టీడీపీ అభ్యర్ధి మంతెన శివరామరాజు ,వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి పై విజయం సాధించారు. ఆయితే తిరిగి ఈ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేనే టిడిపి రంగంలోకి దింపింది.