మళ్ళీ అక్కడి నుంచే మోదీ పోటీ

SMTV Desk 2019-03-22 16:25:00  narendra modi, bjp, loksabha elections, varanasi constituency, amith shah

న్యూఢిల్లీ, మార్చ్ 22: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో కూడా వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. ఇక బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికలకుగాను 184 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బిజెపి గురువారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జెపి నడ్డా ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేశారు. ప్రధాని మళ్లీ క్రితం ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసినుంచే పోటీ చేస్తుండడంతో ఆయన ఈ సారి ఒడిశాలోని పూరీనుంచి బరిలోకి దిగుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.