ఉత్తర ప్రదేశ్, ఆగస్ట్ 10: రాజకీయాల్లో ఉన్నవారు చట్టాలు అతిక్రమించడం కొత్త ఏమి కాదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లోని అహ్మద్పూర్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన క్యాంపెయిన్లోని 175 కార్లు టోల్ చెల్లించకుండా వెళ్లాడు. అయితే ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. సమాజ్వాది నాయకుడు రాజ్బలి యాదవ్ విగ్రహావిష్కరణ కోసం ఫైజాబాద్ వెళ్తుండగా ఈ వీడియో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో ప్రజలంతా అఖిలేశ్పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనపై అఖిలేశ్ స్పందిస్తూ నా మద్దతుదారులు నిబంధనలు అతిక్రమించి టోల్ చెల్లించకుండా వెళ్లినట్లు నిరూపిస్తే ఆ మొత్తం నేను చెల్లిస్తానని వెల్లడించారు.