గత కొన్నాళ్లుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరియు తెలుగుదేశం పార్టీ మంత్రి గంటా శ్రీనివాసరావులకు మధ్య బయటకి కనిపించని చిన్న కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసినదే.దీనికి అనేక కారణాలు ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు.అవన్నీ పక్కన పెడితే పవన్ మరోసారి గంటా శ్రీనివాసరావుకు తనదైన మార్క్ వార్నింగ్ ఇచ్చారు.ఈ రోజు పవన్ తన నామినేషన్ దాఖలు చేసుకునేందుకు గాజువాక చేరుకున్న సంగతి అందరికి తెలిసినదే,అక్కడ నామినేషన్ వేసిన తర్వాత పవన్ అక్కడ దగ్గరలోని భీమిలి నియోజకవర్గానికి చేరుకున్నారు.
అక్కడ నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల సందీప్ కు ప్రచారం చేసేందుకు వెళ్లారు.ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.గంటా అధికారంలో ఉండి కూడా తన నియోజకవర్గాన్ని బాగుచేయలేకపోయారని,అక్కడ ఎప్పటి నుంచో ఉన్న జూట్ మిల్ సమస్యను తీర్చడంలో గంటా పూర్తిగా విఫలం అయ్యారని,ఎన్నికల ముందు గంటా గారు హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత పారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసారు.తాను గంటా శ్రీనివాసరావు గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సరే అసెంబ్లీకి వెళ్లకుండా ఓడించే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ తనదైన మార్క్ వార్నింగ్ ఇచ్చారు.