ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ దిశగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు.. అధినేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ అని.. అటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పవన్ కల్యాణ్. గాజువాక జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఈరోజు గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు.
అయితే.. గాజువాక నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని.. ఇక్కడ సమస్యలపై ఏ రాజకీయ పార్టీలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇక్కడి నుంచి బరిలోకి దిగానని... అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. అదేవిధంగా క్రిమినల్ పొలవిటీషియన్లపై యుద్ధం చేసేందుకు తాను విశాఖ ఎంపీగా జనసేన తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలబెట్టామని పవన్ కల్యాణ్ వివరించారు.