పోసాని కృష్ణమురళిపై ఎలక్షన్ కమీషన్ కొరఢా ఝుళిపించింది. ఇటీవల తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని రూపొందించారని, దాన్ని ఈ ఎన్నికల వేళ విడుదల చేయరాదంటూ టీడీపీకి చెందిన ఓ నేత సెన్సార్ బోర్డుతో పాటు ఎలక్షన్ కమీషన్కు ఫిర్యాదు చేయడం దీనిపై పోసాని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ముఖ్యమంత్రిని చీల్చి చండాడటం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పోసాని చేసిన వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ నేతలు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్ను ఆశ్రయించారు.
దీంతో ఆగ్రహించిన ఎలక్షన్ కమీషన్ పోసాని కి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈసీ తనను అమరావతి వచ్చి వివరణివ్వాలని కోరడం విడ్డూరంగా వుందని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ..ఈసీ స్వతంత్ర సంస్థ అలాంటి సంస్థ ఓ పార్టీ ప్రభావితం చేస్తే తనని అమరావతి వచ్చి వివరణ ఇమ్మనడం ఇదేమైనా పద్దతేనా? అని పోసాని చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియప్ అయ్యింది. దీంతో వెంటనే వివరణ ఇవ్వాలని పోసానికి నోటీసులు పంపించింది. అయితేతాను ఈసీ ముందుకు రాలేనని, తనకు ఆరోగ్యం బాగా లేదని పోసాని ఈసీకి లెటర్ పంపించారట.