హైదరాబాద్, మార్చ్ 20: నకిలీ వీసాలు సృష్టించి మనుషులను అక్రమంగా విదేశాలకు రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ దందా చేస్తున్న 17మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరి దగ్గరి నుంచి 200 పాస్పోర్టులు, నకిలీ వీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దందాకు సంబంధించి ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేశామని తెలిపిన సీపీ.. వీటిలో 71 మంది అరెస్టు చేయగా.. 21 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ అక్రమ మానవ రవాణా ముఠాకు ముంబైలోని ఓ రిజిస్టర్ ఏజెంట్తో లింకులున్నట్లు గుర్తించామన్నారు. చేవెళ్ల వీరికి నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇప్పించారనీ.. ఇందుకు కానిస్టేబుల్ మధు ఈ ముఠాకు సహకరించారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.