భువనేశ్వర్, మార్చ్ 20: ఒడిశా సిఎం, బిజెడి చీఫ్ నవీన్ పట్నాయక్ నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. చాత్రాపూర్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో హింజ్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. హింజ్లీ నుంచి వరుసగా ఐదోసారి ఆయన పోటీ చేస్తున్నారు. తొలిసారిగా ఆయన రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన బీజేపూర్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు ఈ రెండు స్థానాలకు ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్నాయి.