ఆ వార్తల్లో నిజం లేదు : కేజ్రీవాల్‌

SMTV Desk 2019-03-21 12:43:22  kejriwal, aam admi party, congress, new delhi

న్యూఢిల్లీ, మార్చ్ 20: ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు అని వస్తున్న వార్తలపై ఆప్‌ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్ని కాంగ్రెస్‌ కావాలనే సృష్టిస్తోందని, తమతో కలిసి నడవాలన్న ఆప్‌ ప్రతిపాదనను కాంగ్రెస్‌ ఇప్పటికే తిరస్కరించిందని ఆయన గుర్తుచేశారు. పొత్తు వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌.. పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మోదీని గద్దెదించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.