అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్దం : భద్రతా బలగాలపై తాలిబన్లదే పైచేయి

SMTV Desk 2019-03-21 11:57:57  afghanistan, terror attack, army,

అఫ్గానిస్తాన్‌, మార్చ్ 19: అఫ్గాన్‌–తుర్కిమెనిస్థాన్‌ సరిహద్దుల్లో జరుగుతున్న పోరులో భద్రతా బలగాలపై ఉగ్రావాదులాదే పైచేయి సాధించారు. ఈ నేపథ్యంలో 58 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు ముష్కరులు. ఈ పోరులో పదుల సంఖ్యలో సైనికులు భయంతో పారిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది రక్షణ శాఖ. అయితే, 72 మంది సైనికులు తమకు చిక్కినట్లు ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. అంతర్యుద్ధాన్ని ముగించేందుకుగాను అమెరికా ఒక వైపు తాలిబన్లతో చర్చలు కొనసాగిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.