మార్చ్ 19: షియోమీ సంస్థ భారత్లో నూతనంగా ఎంపై పే సేవలను ప్రారంభించింది. గత సంవత్సరం డిసెంబర్లోనే షియోమీ ఈ సేవలను ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సేవలను ఈ రోజు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుండి భారత్లోని స్మార్ట్ఫోన్ యూజర్లకు ఎంఐ పే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక షియోమీ ఐసీఐసీఐ బ్యాంక్తో భాగస్వామ్యమై ఆ సేవలను వినియోగదారులకు అందిస్తున్నది. ఈ క్రమంలో యూజర్లు ఎంఐ పే యాప్ను ఉపయోగించి ఆన్లైన్లో యూపీఐ ద్వారా నగదును సులభంగా ఇతరులకు పంపవచ్చు. ఇతరుల నుంచి నగదును స్వీకరించవచ్చు. అలాగే బిల్ పేమెంట్స్, రీచార్జిలు కూడా చేసుకోవచ్చు.