పనాజీ, మార్చ్ 19: గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ సావంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గోవా అసెంబ్లీలో రేపు బలపరీక్ష ఉంటుందని, అలాగే మనోహర్ పారికర్ మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించామని, ఇది పూర్తయ్యే వరకు తనకెవరూ శుభాకాంక్షలు చెప్పొద్దని, పూలతో స్వాగతించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని సావంత్ పేర్కొన్నారు. డిప్యూటి సియంలుగా విజుయ్ సర్దేశాయ్, సుదిన్ దవలికర్లు కొనసాగుతున్నారని ఆయన చెప్పారు.