వరంగల్, జూన్ 2 : తెలంగాణా మూడవ ఆవిర్భావ వేడుకల్లో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ లో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న విద్య శాఖా మంత్రి, డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అయన ప్రసంగిస్తున్న సమయం లో అస్వస్థతకు గురై కింద పడటం జరిగింది. వెంటనే అక్కడున్న అధికారులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు. అయన కోలుకున్నారు అని చెప్పారు. ఎండా తీవ్రత ఎక్కువగా ఉండటం వలన కళ్ళు తిరిగి కింద పడటం జరిగింది అంటున్నారు.