అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రామకృష్ణ రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసిపి అధ్యక్షుడు జగన్తో సమావేశమయ్యారు. ఆదివారం ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మంత్రి కొణతాల రామకృష్ణ పేరు లేదు. మరోవైపు ఎంపి సీట్లతో పాటుకొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను తెదేపా ఇంకా పెండింగ్లోనే ఉంచింది. ఈ నేపథ్యంలో కొణతాల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.