అందుకే తెరాస లో చేరాను : ఆరేపల్లి మోహన్

SMTV Desk 2019-03-17 17:18:14  TRS, arepalli mohan,

హైదరాబాద్, మార్చ్ 17: కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది, టీ- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ ఆ పార్టీని వీడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో ఆరేపల్లి చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ని కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, ఆరేపల్లి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమ కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసే ఆ పార్టీలో చేరానని అన్నారు. ‘బంగారు తెలంగాణ’ సాధనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోందని విమర్శించారు.