హిట్లర్‌, ముస్సోలిని ,మోది వంటి నియంతలు మనకు వద్దు : దిగ్విజయ్‌

SMTV Desk 2019-03-16 18:36:45  narendra modi, rahul gandhi, bjp, congress party, digwijay singh

న్యూఢిల్లీ, మార్చ్ 16: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఓ ట్వీట్ చేశారు. తాను రాహల్‌ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని, గౌతమబుద్దుడు, మహావీర్‌ వంటివారు ప్రచారం చేసిన శాంతి, జాలి, దయ వంటి సిద్ధాంతాలు ప్రపంచానికి కావాలి. కాని విద్వేషం, హింస రేపే భావజాలం కలవారు కాదు అన్ని అన్నారు. మనకు మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి వారు కావాలి. అంతేగాని హిట్లర్‌, ముస్సోలిని ,మోది వంటి నియంతలు కాదు అని ఆయన ట్వీట్‌ చేశారు. న్యూజిలాండ్‌ కాల్పులపై మృతులకు సంతాపం తెలుపుతూ శుక్రవారం రాహుల్‌ ట్వీట్‌ చేశారు. న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాదానికి చెందిన నీచపు చర్య. ఇటువంటి చర్యను పూర్తిగా ఖండించాలి. ఇటువంటి వాటిని అర్ధం చేసుకుంటూ వీటికి వ్యతిరేకంగా ప్రపంచం నిలబడుతుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.